Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : యమలీల(yamaleela) (1994)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి(S.V.KrishnAreddy)
గానం : కె.ఎస్. చిత్ర(K.S.chitra), ఎస్.పి.బాలు(S.P.BAlu)


పల్లవి :
సిరులొలికించే
చిన్ని నవ్వులే
మణిమాణిక్యాలు
చీకటి ఎరగని
బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే
మా ధనధాన్యాలు
ఎదగాలీ ఇంతకు ఇంతై
ఈ పసికూనా
ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా
మహారాజులా జీవించాలి
నిండునూరేళ్లూ ॥
జాబిల్లి జాబిల్లి జాబిల్లి
మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి
చరణం : 1
నాలో మురిపెమంతా
పాల బువ్వై పంచనీ
లోలో ఆశలన్నీ
నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని
చందమామే నువ్వనీ
ఊరూవాడ నిన్నే
మెచ్చుకుంటే చూడనీ
కలకాలమూ కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ॥
చరణం : 2
వేశా మొదటి అడుగు
అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు
అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు
ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా
అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్నప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా॥
Special Note:
ఎస్.వి.కృష్ణారెడ్డి 1991లో వచ్చిన ‘కొబ్బరిబొండాం’ చిత్రం ద్వారా సంగీత దర్శకత్వంలో అడుగుపెట్టారు. 1994లో వచ్చిన ‘యమలీల’ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సంగీతం కూడా అందించారు. 1994లో యమలీల చిత్రానికి గాను బెస్ట్ డెరైక్టర్‌గా, బెస్ట్ మ్యూజిక్ డెరైక్టర్‌గా రెండు ఫిలింఫేర్ అవార్డులు వరించాయి.

చిత్రం : రక్షకుడు (1998)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : హరిహరన్, సుజాత
06 January - నేడు ఎ.ఆర్.రెహమాన్ బర్త్‌డే

పల్లవి :
చందురుని తాకినది
ఆర్మ్‌స్ట్రాంగా (2)
అరె ఆర్మ్‌స్ట్రాంగా...
చెక్కిలిని దోచినది నేనేగా... అరె నేనేగా
కలల దేవతకీ
పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం (2)॥
చందురుని తాకినది
నీవేగా... అరె నీవేగా
వెన్నెలని దోచినది
నీవేగా... అరె నీవేగా
వయసు వాకిలిని తెరిచె వయ్యారం
నీ కలల మందారం
శ్రుతిలయల శృంగారం
చరణం : 1
పూవులాంటి చెలి ఒడిలో
పుట్టుకొచ్చె సరిగమలే (2)
పైటచాటు పున్నమిలా
పొంగే మధురిమలే
తలపుల వెల్లువలో
తలగడ అదుముకున్నా
తనువుని పొదువుకొని

ప్రియునే కలుసుకున్నా
తాపాల పందిరిలో
దీపమల్లె వెలుగుతున్నా
మగసిరి పిలుపులతో
తేనెలాగ మారుతున్నా
కోరికల కోవెలలో
కర్పూరమౌతున్నా॥
చరణం : 2
రమ్మనే పిలుపు విని
రేగుతోంది యవ్వనమే
ఏకమై పోదామంటూ
జల్లుతోంది చందనమే
నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా
కోరుకున్న ప్రియసఖుడు
కౌగిలికి భారమౌనా
చెంతచేర వచ్చినానే
చేయిజారిపోకే పిల్లా
పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల
అలిగిన మగతనమే పగబడితే వీడదే॥

చిత్రం : పాండురంగ మహాత్మ్యం(pANDura~nga mahAtmyam (1957)
రచన : సముద్రాల రామానుజాచార్య(samudrAla rAmAnujAchArya)
సంగీతం : టి.వి.రాజు(T.V.rAju)
గానం : పిఠాపురం, మాధ వపెద్ది సత్యం(piThApuram,mAdhavapeddi satyam)


పల్లవి :
చెబితే వింటివా గురూ గురూ
వినకే చెడితిరా శిష్యా శిష్యా
నే వినకే చెడితిరా శిష్యా శిష్యా॥చెబితే॥
చరణం : 1
ఇహపరాలకు బేరులు వద్దు
కూటి కొరకు పెడదారులు వద్దని
చె బితే వింటివా గురూ గురూ
నే చె బితే వింటివా గురూ గురూ॥
ఇహం పోయెరా... పరం పోయెరా...
ఇహం పోయెరా... పరం పోయెరా...
దాసుగాడిదీ దస్తం పోయెరా॥
అవును...॥చెబితే॥
చరణం : 2
చెరపబోకురా చెడతావంటే
చెవిని బెడితివా గురూ గురూ
నే చె బితే వింటివా గురూ గురూ॥
తాను తీసిన గోతులలోన...
తాను తీసిన గోతులలోన
తానే పడటం తప్పదు శిష్యా॥॥చెబితే॥


Special Note:
సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్), రత్నమ్మ దంపతులకు జన్మించారు సముద్రాల రామానుజాచార్యులు (సముద్రాల జూనియర్). వీరి స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా పెదపులివర్రు గ్రామం. రత్నమ్మగారి తండ్రి పేరునే రామానుజాచార్యకు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యం, సంస్కృతం పట్ల ఇష్టం ఉండటంతో 1952లో వినోదావారు నిర్మించిన ‘శాంతి’ చిత్రానికి పాటలు రాసి తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు.

సముద్రాల రామానుజాచార్య