Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Oh dEvadA Oh pArvathI - ఓ దేవదా ఓ పార్వతీ

చిత్రం : దేవదాసు(dEvadAsu) (1953)
రచన : సముద్రాల సీనియర్(samudrAla senior)
సంగీతం : సి.ఆర్. సుబ్బరామన్(C.R.subbarAman)
గానం : జమునారాణి, ఉడుతా సరోజిని(jamunArANi,vuDutA sarOjini)
16 March - నేడు సముద్రాల రాఘవాచార్య వర్ధంతి


పల్లవి :
ఓ... దేవదా... ఓ... పార్వతీ...
చదువు ఇదేనా అయ్యవారూ నిదరోతే తమరూ ఇలాగే దౌడో దౌడా...
ఓ... దేవదా... ॥
చరణం : 1
కూనలమ్మ మర్రిలో గిజిగాళ్లున్నాయే
పడితే వాటముగా పట్టుపడేనే॥
బడిమానే ఎడముంటే
ఎపుడూ ఇలాగే ఆటే ఆట (2)
ఓ... పార్వతీ...
చరణం : 2
రెక్కరాని కూనలే పడితే పాపమే
బడిలో నేర్పినదీ ఈ చదువేనా॥
బడిలోనే చదువైతే
బ్రతుకూ ఇలాగే బెదురూ పాటే (2)
ఓ... పిరికి పార్వతీ...
చరణం : 3
తేలెనులే నీ బడాయి
చాలునులే ఈ లడాయి ॥
లడాయిలా సరే మనకు
జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ... అన్నా ఊ... అన్నా
అలిగిపోయే ఉడుకుమోతా (2)
రా రా పిరికి పార్వతీ...
పో పో దుడుకు దేవదా...

Special Note:
పూర్తిపేరు : సముద్రాల వేంకట రాఘవాచార్య
జననం : 19-7-1902
జన్మస్థలం : పెదపులివర్రు గ్రామం, కృష్ణాతీరం
తల్లిదండ్రులు : లక్ష్మీతాయారు,వేంకట శేషాచార్యులు
చదువు : మెట్రిక్యులేషన్,సంస్కృతంలో భాషాప్రవీణ
వివాహం-భార్య : 1918, రత్నమ్మ
పిల్లలు : కుమారులు (వేంకట రామానుజాచార్యులు, వేంకట శేషాచార్యులు), కుమార్తెలు (కుముదవల్లి, అలమేలు మంగతాయారు)
తొలిపాట - సినిమా : దేవుని మహిమా తెలియగ వశమా - కనకతార (1937)
ఆఖరిపాట - సినిమా : రామకథ శ్రీ రామకథ - శ్రీరామకథ (1968)
పాటలు : దాదాపు 800
దర్శకునిగా : వినాయకచవితి (1957), భక్తరఘునాథ్ (1960), బభ్రువాహన (1964)
నిర్మాతగా : స్త్రీ సాహసం (1951),
శాంతి (1952), దేవదాసు (1953)
గాయకునిగా : హరేకృష్ణ హరేరామ హరే శ్రీకృష్ణహరే (భక్త రఘునాథ్)
ఇతర విషయాలు : సముద్రాల బాల్యమంతా రేపల్లెలో గడిచింది. నాలుగో ఫారం చదువుతున్నపుడే కవిత్వానికి శ్రీకారం చుట్టారు. 1925 నాటికి సాహిత్యాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు సముద్రాల. 1925 నుంచి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1932లో ‘ప్రజామిత్ర’ వారపత్రికకు సంపాదకునిగా చేరారు. ఈ సమయంలోనే సీతాకళ్యాణం (1934), శ్రీకృష్ణలీలలు (1935) చిత్రాలకు ప్రకటనలు రాశారు. ఇది సినిమాకు సంబంధించినంత వరకు సముద్రాల తొలి అడుగు. తెలుగు సినీ గేయ రచనకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన సముద్రాలను‘సినీ కవికులగురువు’ గా అభివర్ణిస్తారు.
మరణం : 16-3-1968
విగ్రహం : సముద్రాల 108వ జయంతి సందర్భంగా ఫిలింనగర్ (హైదరాబాద్) లో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

చిత్రం : ఇష్క్(IshQ) (2012)
రచన : అనంత శ్రీరామ్(anant SrIrAm)
సంగీతం : అరవింద్-శంకర్(aravind-Sankar)
గానం : హరిహరన్, సైంథవి(hariharan,sainthavi)


పల్లవి :
సూటిగా చూడకు...
సూదిలా నవ్వకు...
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ
ఊసురే తీయకు
సొగసే సెగలే పెడితే
చెదరదా కునుకు
సూటిగా॥
చరణం : 1
నింగిలో మెరుపల్లె తాకినది నీ కల
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం
మరుగేయగా
అంతా నీవల్లే నిముషంలో
మారిందంటా
బంతి పూవల్లే నా చూపే
విచ్చిందంటా॥
సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
లక్ష్మీ కళ్యాణ వైభోగమే

చరణం : 2

గంటలో మొదలైంది కాదు
ఈ భావన
గతజన్మలో కదిలిందో ఏమో
మన మధ్యన
ఉండుండి నా గుండెల్లో
ఈ ఎదురేమిటో
ఇందాకిలా ఉందా
మరి ఎపుడెందుకో
నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి॥

చిత్రం : మూగమనసులు(mUgamanasulu) (1964)
రచన : ఆచార్య ఆత్రేయ(AchArya AtrEya)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.suSeela)



పల్లవి : ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడివేసెనో ||ఓ... ॥
చరణం : 1
మబ్బులు కమ్మిన ఆకాశం
మనువులు కలసిన మనకోసం॥
కలువల పందిరి వేసింది
తొలి వలపుల చినుకులు చిలికింది॥॥
చరణం : 2
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
నీ చేతలలో చిలిపితనం
చిత్తంలో వలపుధనం (2)
అనుభవించి దినం దినం పరవశించనా
పరవశించి క్షణం క్షణం పలవరించనా॥
చరణం : 3
ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో (2)
ఉప్పొంగి ఉరికింది గోదావరీ గోదావరీ
చెలికాని సరసలో సరికొత్త వధువులో (2)
తొలినాటి భావాలు తెలుసుకోవాలని
ఉప్పొంగి ఉరికింది గోదావరీ ॥
Special NOte:
పూర్తిపేరు : కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం మహదేవన్
జననం : 14-03-1918
జన్మస్థలం : కృష్ణన్ కోయిల్, తమిళనాడు
తల్లిదండ్రులు : లక్ష్మీఅమ్మాళ్, వెంకటాచలం అయ్యర్
తొలిచిత్రం : దేవదాసి (తమిళం)
దొంగలున్నారు జాగ్రత్త (1958) (తెలుగు)
తెలుగులో ఆఖరి చిత్రం : కబీర్‌దాస్ (2003) - ఆయన మరణానంతరం రిలీజ్ అయింది
మొత్తం చిత్రాలు : సుమారు 650పైగా (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం)
అవార్డులు : ఉత్తమ సంగీత దర్శకునిగా రెండు జాతీయ అవార్డులు. తమిళం-కందన్ కరుణై (1967), తెలుగు-శంకరాభరణం (1979). మూడు నంది అవార్డులు (శంకరాభరణం-1979, శ్రుతిలయలు-1987, మంజీరనాదం-1991)
బిరుదులు : 1963-తిరై ఇసై తిలగం, 1967-మెల్లిసై చక్రవర్తి, 1973-కలైమామణి, 1976-స్వరబ్రహ్మ, 1976-సంగీత చక్రవర్తి
ఇతర విషయాలు : గ్రామ్‌ఫోన్ కంపెనీలో నెల జీతానికి సంగీత దర్శకులుగా కెరీర్ ప్రారంభించి, సినిమా సంగీత దర్శకులైన వారిలో మహ దేవన్ రెండవవారు. తెలుగులో మహదేవన్‌ని అందరూ ముద్దుగా ‘మామ’ అని పిలిచేవారు. మహదేవన్‌కు అసిస్టెంట్‌గా పుహళేంది దాదాపు అన్ని చిత్రాలకు పనిచేశారు. ఆచార్య ఆత్రేయ- మహదేవన్ కలయికలో ఎన్నో హిట్ పాట లొచ్చాయి. అందుకే వీరిని సినీ పరిశ్రమ ‘హిట్ కాంబినేషన్’ గా గుర్తించింది.
మరణం : 21-06-2001
మనువులు కలసిన మనకోసం॥