Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

idiyE hAyi kalupumu - ఇదియే హాయి కలుపుము

చిత్రం : రోజులు మారాయి (1955)
రచన : తాపీ ధర్మారావు
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, జిక్కి
08 May - నేడు తాపీ ధర్మారావు వర్ధంతి


పల్లవి :
ఇదియే హాయి కలుపుము చేయి
వేయి మాటలేలనింక... (2) ॥
చరణం : 1
ఓ... ఆ చూపులోనే కురియును తేనె
చిరునగవాహా వెలుగున వాలి
మనసుకు హాయి సోలునే... (2)
నీవాడిన మాట సాటిలేని పూలబాట
సాటిలేని పూలబాట... ఓ... ॥
చరణం : 2
అందాలలోన నడివడిలోన
తొలుతను నీవే తెలియగరావే
బ్రతుకున మేలు చూపవే... (2)
నీ చూపే చాలు అదే నాకు వేనవేలు
అదే నాకు వేనవేలు... ఓ... ॥
చరణం : 3
ఈ లోకమేమో మరో లోకమేమో
మనసులతోనే తనువులు తేలే
బ్రతుకిక తూగుటూయలే... (2)
ఈనాటి ప్రేమ లోటులేని మేటి సీమ
లోటులేని మేటి సీమ... ఓ... ॥

Special Note:
పూర్తిపేరు : తాపీ ధర్మారావు నాయుడు
జననం : 19-09-1887
జన్మస్థలం : ఒరిస్సాలోని బరంపురం
తల్లిదండ్రులు : నరసమ్మ, డాక్టర్ అప్పన్న
చదువు : బి.ఏ.(పచ్చయ్యప్ప కాలే జ్ , చెన్నై)
తోబుట్టువులు : అన్నయ్య (నరసింగరావు), తమ్ముడు (తులసీరావు), చెల్లెళ్లు (వెంకటనరసమ్మ, తిరుపతమ్మ)
వివాహం : 1902
భార్య : అన్నపూర్ణమ్మ
పిల్లలు : కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)
పాటలు రాసిన తొలిచిత్రం : రైతుబిడ్డ (1939)
ఆఖరిచిత్రం : భీష్మ (1962)
పాటలు : సుమారు 250
గౌరవ పురస్కాలు : శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు, చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు. మరెన్నో సాహిత్య అవార్డులు.
ఇతర విషయాలు : ‘తాతాజీ’ గా అందరికీ సుపరిచితులు. ఈయన గిడుగు రామమూర్తి పంతులు గారి శిష్యులు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలలో పనిచేశారు. కళాశాల, సర్వే డిపార్ట్‌మెంట్‌లలో పలు ఉద్యోగాలు చేశారు. ఈయన తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో వెలువడింది. తరువాత అనేక రచనలు చేశారు. మాలపిల్ల (1938) సినిమా రచనతో సినీరంగ ప్రవేశం జరిగింది. 1943లో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సమావేశానికి అధ్యక్షత వహించారు. రచయితగా, భాషాపండితుడిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా ప్రసిద్ధులు.
మరణం : 08-05-1973

chEtilO cheyyEsi - చేతిలో చెయ్యేసి చెప్పు

చిత్రం : దసరా బుల్లోడు(dasarA bullODu) (1971)
రచన : ఆచార్య ఆత్రేయ(achArya atrEya)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : పి.సుశీల(P.suSeela)
07 May - నేడు ఆత్రేయ జయంతి


పల్లవి :
చేతిలో చెయ్యేసి చెప్పు బావా (2)
చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు
చెరిపివేస్తానని మరచిపోతానని॥
చరణం : 1
పాడుకున్న పాటలు పాతవనీ ఊరుకో (2)
ఆ మాటలన్నీ మాపేసి కొత్తపాట పాడుకో॥
చరణం : 2
మాట తప్పిపోయినా
మనిషి బ్రతికితే చాలు (2)
మన మమత చంపుకున్నా
ఒక మంచి మిగిలితే చాలు॥
చరణం : 3
తెలియక మనసిచ్చినా
తెలిసి కుమిలిపోతున్నా (2)
మిమ్ము కలపమని ముక్కోటి దేవతలకు
మొక్కుతున్నా॥

Special Note:
అసలు పేరు :కిళాంబి వేంకట నరసింహాచార్యులు
జననం : 07-05-1921
జన్మస్థలం : నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలుకా మంగళంపాడు
స్వస్థలం : సూళ్లూరుపేట తాలుకా ఉచ్చూరు
తల్లిదండ్రులు : సీతమ్మ, కృష్ణమాచార్యులు
చదువు : ఎస్.ఎస్.ఎల్.సి.
వివాహం - భార్య : 1940 - పద్మావతి
తొలిచిత్రం - పాట : దీక్ష (1951) -పోరా బాబూ పో పోయి చూడు లోకం పోకడ
ఆఖరిచిత్రం - పాట : ప్రేమయుద్ధం (1990) - ఈ మువ్వలగానం మన ప్రేమకు ప్రాణం
పాటలు : సుమారు 1400
దర్శకునిగా : వాగ్దానం (1961)
నటించిన సినిమా : కోడెనాగు (1974)
గౌరవ పురస్కారాలు : 1989 మే లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు పొందారు. తొలి కోడి కూసింది (1981) లో ‘అందమైన లోకమనీ’ పాటకు నంది అవార్డు అందుకున్నారు.
ఇతరవిషయాలు : గోత్రనామం ఆత్రేయను, పేరులో ఆచార్యను కలిపి ‘ఆచార్య ఆత్రేయ’ అని పెట్టుకున్నారు. చిన్నప్పుటి నుండే చదువు మీద కన్నా నాటకాల మీదనే మక్కువ చూపేవారు. రాజన్ అనే మిత్రుని సాయంతో మద్రాసు చేరుకున్నారు ఆత్రేయ. అక్కడ ఒకసారి వీధి దీపం కింద కూర్చొని ‘గౌతమబుద్ధ’ అనే నాటకం రాసి దానిని యాభైరూపాయలకు అమ్మి, దానితో తన అవసరాలను తీర్చుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చిన్న వేషానికి అవకాశమొచ్చినా అది నచ్చక వెనక్కి వ చ్చేశారు. ఆ తర్వాత షావుకారు చిత్రానికి డైలాగులు రాసే అవకాశం వచ్చినా అప్పుడు ఆరోగ్యం సహకరించలేదు. కొన్నాళ్ల తర్వాత ‘మనోహర’ అనే చిత్రానికి డైలాగ్ అసిస్టెంట్‌గా మాటసాయం చేశారు. చివరికి ‘దీక్ష’ సినిమాతో ఆత్రేయ సినీరంగంలోకి తెరం గేట్రం చేశారు. చాలా పద్యాలు, నాటకాలు, నాటికలు రచించారు. దాదాపు 400 చిత్రాలకు రచన చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని 7 సంపుటులుగా 1990లో ప్రచురించారు, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు.
మరణం : 13-09-1989

చిత్రం : భాగ్యచక్రము(bhAgyachakramu) (1968)
రచన : పింగళి(pi~ngaLi)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు(peNDyAla nAgEswararAo)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.suSeela)
06 May - నేడు పింగళి వర్ధంతి


పల్లవి :
నీవులేక నిముసమైన నిలువజాలనే (2)
నీవె కాదా ప్రేమ నాలో విరియచేసినది (2)
మ్మ్... విరియ చేసినది...
ఈ... విరియ చేసినది...
నీవులేక నీముసమైన నిలువజాలనే
చరణం : 1
లోకమంతా నీవుగానే నాకు తోచెనుగా (2)
మరువరాని మమతలేవో
మదిని పూసెనుగా (2)
ఆ... మదిని పూసెనుగా...
నీవులేక నీముసమైన నిలువజాలనే
చరణం : 2
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
వీడిపోని నీడవోలే కూడి ఉందుముగా (2)
ఆ... కూడి ఉందుముగా...॥

Special Note:
పూర్తిపేరు : పింగళి నాగేంద్రరావు
జననం : 29-12-1901
జన్మస్థలం : బొబ్బిలి తాలుకా రాజాం
తల్లిదండ్రులు : మహాలక్ష్మమ్మ,గోపాలకృష్ణయ్య
చదువు : మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో
తొలిచిత్రం - పాట : భలేపెళ్లి (1942) - మనోహరీ అని అనేక కన్నెల
ఆఖరిచిత్రం - పాట : నీతి నిజాయితీ (1972) - భలే మజాలే భలే ఖుషీలే
పాటలు: సుమారు 300 (28 చిత్రాలు)
కథ, మాటలు, పాటలు అందించిన తొలిచిత్రం : భలేపెళ్లి (1942)
ఆఖరిచిత్రం : శ్రీకృష్ణసత్య (1971)(ఆయన మరణాంతరం విడుదలైంది)
మాటలు అందించిన ఆఖరిచిత్రం : చాణక్య చంద్రగుప్త (1977)
ఇతరవిషయాలు : పింగళికి రెండేళ్ల వయసు ఉన్నప్పడు కుటుంబం బందర్‌కు వలసి వచ్చింది. అక్కడ పింగళి వారి బాల్యం, విద్యాభ్యాసం కొనసాగింది. పింగళి తల్లి కవయిత్రి కావడంతో భారత భాగవత రామాయణా దులలు పింగళికి ఒంటబట్టాయి. సినిమాలకు రాక ముందు టీచర్‌గా, రైల్వే ఉద్యోగిగా ‘కృష్ణాపత్రిక’, ‘శారద పత్రిక’లలో ఉపసంపాదకునిగా పనిచేశారు. శారద పత్రిక నిలిచిపోగానే, తర్వాత డి.వి.సుబ్బా రావు గారి ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో చేరి 1946 వరకు సెక్రటరీగా పనిచేశారు. పింగళి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. రామ్మూర్తి అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. 1941లో ‘భలేపెళ్లి- తారుమారు’ జోడు చిత్రాలకు పనిచేసే అవకాశం వచ్చింది. కాని రెండో ప్రపంచ యుద్ధం జరగడంతో మద్రాస్‌లో సినీ నిర్మాణం కుంటుపడింది. తర్వాత 1946లో డా. దుర్గా నాగేశ్వరరావు, డి.వి.సుబ్బారావులు పింగళిని పిలిచి ఆయన రాసిన ‘వింధ్యారాణి’ నాటకాన్ని చిత్రంగా తీశారు. అది పరాజయం అంచున ఉండిపోయింది. ఆ సమయంలో మిత్రుడైన బందర్ వాస్తవ్యులు కమలాకర కామేశ్వరరావు పింగళికి ధైర్యం చెప్పి, కె.వి.రెడ్డికి పరిచయం చేశారు. వారి కలయిక ఇక పింగళివారి పేరును తారస్థాయికి తీసుకొని వెళ్లింది. సినీ జగత్తును తన మాటల, పాటల మాయాజాలంతో ఆశ్చర్యం కల్పించిన మాంత్రికుడు పింగళి అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.
మరణం : 06-05-1971