Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

prachaNDa chaNDa - ప్రచండ చండ మార్తాండ

చిత్రం : దమ్ము(dammu) (2012)
రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : ఫృథ్వీచంద్ర, గీతామాధురి,రేవంత్, జి.సాహితి
10 May - నేడు చంద్రబోస్ పుట్టినరోజు

సాకీ :
అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతల
విదర్భ మగధ సింహళ సాళ్వ గౌళ బర్బర
అవంతి చోళ లాట పాండ్య చేరి మద్ర
చక్రవర్తులెందరున్నా వీడు ఏకవీరుడు
ఏకైక క్షాత్రవీరుడు
కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం
సాముద్రికం ఉచ్ఛాటనం
ఆకర్షణం విద్వేషణం
అగ్ని జల వయస్తంభం
బహుకళాప్రవీణుడు
ప్రవీణుడు నవీనుడు...
బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ
వజ్ర దండ కుంత శూల
ధనుర్విద్యా ప్రపూర్ణుడు
ఘనఘనఘన ఘనుడు
అగిణిత గుణ ఘనుడు
జనగణమున ఘనుడు
రూలర్... రూలర్...
పల్లవి :
ప్రచండ చండ మార్తాండ తేజా...
రాజాధి రాజాధిరాజా
అఖండ మండలానంద భోజా...
రాజధి రాజాధిరాజా
చరితలో వెలుగుతున్న జ్యోతి నీదే
జగతిలో ఎగురుతున్న కీర్తి నీదే
పోరు నీది పేరు నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...॥ప్రచండ ॥
చరణం : 1
ముందు నుండి ముంచుకొచ్చు
మృగాలనైనా
పిడికిలితో ఫెళఫెళఫెళ కూల్చేస్తా
వెనక నుండి తరుముకొచ్చు జ్వాలలనైనా
పాదంతో దబదబదబ తొక్కేస్తా
అందుకే మరందుకే మరందుకే
అందాలని అరచేతిలో పెడుతున్నా
నీకే అందాలని ఆరాట పడుతున్నా
కెరటమై ఉరుకుతున్న చురుకు నీదే
కదనమై దుముకుతున్న దుడుకు నీదే
ఆట నీది వేట నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...॥
చరణం : 2
బీద ధనిక అంతరాలు అంతం చేసి
అందరిపై సమభావం చూపాలి
బంధుప్రీతి వర్గప్రీతి దూరం చేసి
అనునిత్యం సమధర్మం చాటాలి
అందుకే మరందుకే మరందుకే
ప్రాణంలో సగభాగం ఇస్తున్నా
నీ ప్రణయంతో సంపూర్ణమౌతున్నా
శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే
గగనమే మెలిక తిరుగు మెరుపు నీదే
నీతి నీది ఖ్యాతి నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్...

andananta ettA - అందనంత ఎత్తా

చిత్రం : క్షణ క్షణం(kshaNa kshaNam) (1991)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : ఎం.ఎం. కీరవాణి(M.M.keeravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu, chitra)


పల్లవి :
అందనంత ఎత్తా తారాతీరం
సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంతా కొత్తా తాళం తీస్తే
సందె విందు సొంతం కాదా //అందనంత//
చిందే సరదా పొంగే వరదా
స్వర్గం మన సమీపయ్యేంత //అందనంత//
చరణం : 1
గువ్వ నీడలో గూడు కట్టుకో
కుర్ర వేడిలో కుకూ కూత పెట్టుకో
దిక్కులన్నీ తెగించే వేగంతో
రెక్క విప్పు నిషాలెన్నో
గుప్పెడంత కులాసా గుండెల్లో
గుప్పుమన్న ఖుషీలెన్నో
తోటమాలి చూడకుండ
ఏటవాలు పాటవెంట
మొగ్గనవ్వు చేరుకుంటే
చుక్కలింట పండగంట //అందనంత//
చరణం : 2
కొంటె కోనలో కోట కట్టుకో
కొత్త కోకలో కో కో కోరికందుకో
కోనకళ్ల గులాబీ గుమ్మంలో
కాచుకున్న కబుర్లెన్నో
కప్పుకున్న కిలాడీ కొమ్మల్లో
గుచ్చుకున్న గుణాలెన్నో
లాగుతున్న గాలి వెంట
సాగుతున్న పూలమంట
తాకుతుంటే దాగదంట
ఆకాశాన పాలపుంత //అందనంత//

idiyE hAyi kalupumu - ఇదియే హాయి కలుపుము

చిత్రం : రోజులు మారాయి (1955)
రచన : తాపీ ధర్మారావు
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, జిక్కి
08 May - నేడు తాపీ ధర్మారావు వర్ధంతి


పల్లవి :
ఇదియే హాయి కలుపుము చేయి
వేయి మాటలేలనింక... (2) ॥
చరణం : 1
ఓ... ఆ చూపులోనే కురియును తేనె
చిరునగవాహా వెలుగున వాలి
మనసుకు హాయి సోలునే... (2)
నీవాడిన మాట సాటిలేని పూలబాట
సాటిలేని పూలబాట... ఓ... ॥
చరణం : 2
అందాలలోన నడివడిలోన
తొలుతను నీవే తెలియగరావే
బ్రతుకున మేలు చూపవే... (2)
నీ చూపే చాలు అదే నాకు వేనవేలు
అదే నాకు వేనవేలు... ఓ... ॥
చరణం : 3
ఈ లోకమేమో మరో లోకమేమో
మనసులతోనే తనువులు తేలే
బ్రతుకిక తూగుటూయలే... (2)
ఈనాటి ప్రేమ లోటులేని మేటి సీమ
లోటులేని మేటి సీమ... ఓ... ॥

Special Note:
పూర్తిపేరు : తాపీ ధర్మారావు నాయుడు
జననం : 19-09-1887
జన్మస్థలం : ఒరిస్సాలోని బరంపురం
తల్లిదండ్రులు : నరసమ్మ, డాక్టర్ అప్పన్న
చదువు : బి.ఏ.(పచ్చయ్యప్ప కాలే జ్ , చెన్నై)
తోబుట్టువులు : అన్నయ్య (నరసింగరావు), తమ్ముడు (తులసీరావు), చెల్లెళ్లు (వెంకటనరసమ్మ, తిరుపతమ్మ)
వివాహం : 1902
భార్య : అన్నపూర్ణమ్మ
పిల్లలు : కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)
పాటలు రాసిన తొలిచిత్రం : రైతుబిడ్డ (1939)
ఆఖరిచిత్రం : భీష్మ (1962)
పాటలు : సుమారు 250
గౌరవ పురస్కాలు : శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు, చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు. మరెన్నో సాహిత్య అవార్డులు.
ఇతర విషయాలు : ‘తాతాజీ’ గా అందరికీ సుపరిచితులు. ఈయన గిడుగు రామమూర్తి పంతులు గారి శిష్యులు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలలో పనిచేశారు. కళాశాల, సర్వే డిపార్ట్‌మెంట్‌లలో పలు ఉద్యోగాలు చేశారు. ఈయన తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో వెలువడింది. తరువాత అనేక రచనలు చేశారు. మాలపిల్ల (1938) సినిమా రచనతో సినీరంగ ప్రవేశం జరిగింది. 1943లో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సమావేశానికి అధ్యక్షత వహించారు. రచయితగా, భాషాపండితుడిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా ప్రసిద్ధులు.
మరణం : 08-05-1973